రోశయ్య మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లే

Rosaiah
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కె. రోశయ్య మంత్రివర్గ విస్తరణకు కాలం కలిసి రావడం లేదు. తాజాగా సోమవారం ఆయన చేసిన ప్రయత్నం కూడా కలిసి రాలేదని తెలుస్తోంది. ఆయన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తోనూ కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతోనూ మంత్రివర్గ విస్తరణపై ప్రస్తావన చేసినట్లు సమాచారం. అయితే, తాను ఆగస్టు 6వ తేదీ తర్వాత హైదరాబాద్ వస్తానని, అప్పుడు మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడుదామని మొయిలీ రోశయ్యకు చావు కబురు చల్లగా చెప్పినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి సెప్టెంబర్ లో గానీ మంత్రివర్గ విస్తరణ ఉండదని అనుకుంటున్నారు.

పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ప్రధానిని కలిసిన తర్వాత బయటకు వచ్చిన రోశయ్యను మీడియా ప్రతినిధులు మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడారా అని అడిగితే ఆ విషయం మాట్లాడడానికి తానేమీ తెలివితక్కువ వాడిని కానని సమాధానమిచ్చారు. ప్రధానితో మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడినట్లు జరిగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. తమ మధ్య అలాంటి చర్చలేవీ జరగలేదని, ఆ సమయంలో ప్రధానితో మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడటానికి నేనేమి తెలివితక్కువవాన్ని కాదని అన్నారు. కేవలం మర్యాదపూర్వకంగానే ఆయనను కలిసినట్లు చెప్పారు.

అంతకు ముందు రోశయ్య కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వీరప్పమొయిలీని పార్లమెంటు సెంట్రల్ హాలులో కలుసుకున్నారు. ఇరువురి మధ్య రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, తదితరవాటిపై చర్చలు జరిగినట్లు తెలియవచ్చింది. రోశయ్య కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండేతో, గులాం నబీ ఆజాద్ తో సమావేశమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+