వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ముసుగులో టిడిపిపై కుట్ర జరుగుతోంది: ఎర్రబెల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

 Errabelli Dayakar Rao
వరంగల్: తెలంగాణ ముసుగులో తమ పార్టీపై రాజకీయ కుట్ర జరుగుతోందని తెలుగుదేశం పార్టీ నాయకుడు సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు విమర్సించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మృతి చెందిన ఇషాన్ రెడ్డి లేఖతో పాటు, అతని మరణంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇషాన్ రెడ్డి సూసైడ్ లో తనను తెలంగాణ ద్రోహిగా పేర్కొన్నట్లు ఉండడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.

అధికార పార్టీని వదిలేసి తెలంగాణ కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణ ప్రజల విజయమని ఆయన అన్నారు.

ఇషాన్ రెడ్డి లేఖలో తెలంగాణ ద్రోహిగా తన పేరు ఉండడంపై తెలుగుదేశం మరో నాయకుడు కడియం శ్రీహరి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తాను చిత్తశుద్ధితో తెలంగాణకోసం పని చేస్తున్నానని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని వాదించిన నాయకుల్లో తాను ఒక్కడినని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు పోరాడుతామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X