శోభారాణి వ్యాఖ్యలపై చిరంజీవి డోంట్ కేర్

బాబ్లీ సమస్యపై ప్రధాని అధ్యక్షతన జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తమను నిరాశపరిచిందని చిరంజీవి అన్నారు. బాబ్లీ సమస్యకు ఓ పరిష్కారం లభిస్తుందని ఆశించామని కానీ తమ ఆశలపై ప్రధాని నీళ్లు చల్లారని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను బేఖాతరు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఆ తీర్పును గౌరవించాలనటం ఏం సబబని ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన పాఠశాలలు, వైద్యశాలలు లేకుండా బార్లు ఏర్పాటుచేయటం సరికాదన్నారు. ప్రభుత్వం మద్యాన్ని పోషిస్తున్న తీరును ప్రజాచైతన్య యాత్రల్లో ఎండగడతామన్నారు.












Click it and Unblock the Notifications