తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ తోనే తిరుమల పవిత్రతకు భంగం: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుపతి: దివంగత నేత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తిరుపతి పవిత్రతకు భంగం కలగడం ప్రారంభమైందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పుణ్యక్షేత్రం తిరుపతి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చంద్రబాబు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అవినీతికి వ్యతిరేకంగా శనివారం తిరుమలలో టిడిపి చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. తిరుపతి పవిత్రతను మంటగలిపే చర్యలు తితిదేలో జరుగుతున్నాయని విమర్శించారు.

టిటిడి వివాదాలకు నిలయంగా మారిందని, డబ్బులున్న వారికే వెంకటేశ్వర స్వామి దర్శనం సులభంగా జరుగుతోందని, మారుమూల ప్రాంతాల నుంచి వస్తున్న పేదవాళ్లకు దర్శనం దుర్లభం అవుతోందని దుయ్యబట్టారు. అవినీతికి నిరసనగా ఎన్ని సార్లు ప్రజలు ఆందోళనలు చేస్తున్నా ఈ పాలకమండలికి చీమకుట్టినట్త్లెనా లేదని అన్నారు. దేవునికి సేవలు చేయాల్సిన టిటిడి బోర్డు వ్యాపారం చేస్తోందని ఆయన అన్నారు. టిటిడి నీచమైన కార్యానికి ఒడిగట్టిందని ఆయన విమర్శించారు. అన్యాయాలకు, అరాచకాలకు నిలయంగా మారిందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X