హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీకి జగన్ నో: సురేఖ దారిలోనే మరింత మంది ఎమ్మెల్యేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్‌: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పార్టీ అధిష్టానంతో రాజీకి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. అధిష్టానానికి తలొగ్గడానికి ఆయన సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానంతో అమీతుమీ తేల్చుకోవడానికే ఆయన సిద్ధపడినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ దారిలోనే జగన్ వర్గానికి చెందిన మరింత మంది శాసనసభ్యులు అధిష్టానానికి లేఖలు రాయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కాకినాడ అర్బన్ శాసనసభ్యుడు పోరెడ్డి చంద్రశేఖర రెడ్డి తొలుత లేఖ రాయడానికి సిద్ధపడినట్లు సమాచారం. శని, ఆదివారాల్లో ఇందుకు సంబంధించిన వ్యూహం ఖరారయ్యే అవకాశం ఉంది. అంబటి రాంబాబు శుక్రవారం మరోసారి అధిష్టానంపై, ముఖ్యమంత్రి రోశయ్యపై విమర్శలు చేయడాన్ని బట్టి కూడా జగన్ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరని అర్థం చేసుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X