వైయస్ జగన్ విధేయులపై కన్నేసిన కాంగ్రెసు హైకమాండ్

వైయస్ రాజశేఖర రెడ్డి పార్టీ గురించి, పార్టీ అధిష్టానం గురించి కూడా తెలియనివారికి ఎన్నికల్లో టికెట్లు ఇప్పించి గెలిపించుకున్నారు. ఇటువంటి వారే జగన్ కు వూర్తిగా విధేయత ప్రకటిస్తున్నారు. తమకు అధిష్టానం అంటే ఏమిటో తెలియదని కూడా చెబుతున్నారు. ఇటువంటి జాబితాను పార్టీ అధిష్టానం తెప్పించుకున్నట్లు చెబుతున్నారు. తమ మాటకు కట్టుబడి ఉండే వారికి బాధ్యతలు అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా చెబుతున్నారు. రెండు వైపులా ఉండేవారి గురించి సర్వేలు చేయించి సమాచారం తెప్పించుకున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రభావం పిసిసి అధ్యక్ష ఎన్నిక, పార్టీ కార్యవర్గ నియామకం దగ్గరి నుంచి మంత్రివర్గ విస్తరణ వరకు ఉంటుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications