వైయస్ జగన్ నోట తొలిసారి సోనియా గాంధీ మాట

రాష్ట్రవాటాగా 50% నిధులిచ్చేందుకు ముందుకు రావడంతోపాటు, ఒత్తిడి తేవడంతో సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ సర్కారులో కదలిక వచ్చిందన్నారు. ఆ తర్వాత జగన్ కడపలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగర శివార్లలో ఏర్పాటు చేసిన వైఎస్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన తాను గతంలో చెప్పిన విషయాలనే మళ్లీ చెప్పారు. "ఇంతవరకు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంత కాలం ఎన్ని జరుగుతున్నా ప్రజల ఆదరాభిమానాలతోనే చిరునవ్వుతో తిరగలుగుతున్నాను. ప్రజల ముందుకు రాగలుగుతున్నాను. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను'' అని రెండు చేతులెత్తి నమస్కరించారు.












Click it and Unblock the Notifications