వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపు ఇచ్చింది. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన మర్నాడు పార్టీ గుర్తింపునకు దరఖాస్తు చేస్తే ఆయన ప్రథమ వర్ధంతి రోజున పార్టీకి గుర్తింపు లభించింది. ఆ పార్టీ అధ్యక్షుడిగా శివప్ప ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గుర్తింపును ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ నుంచి శివప్పకు మూడు పేజీల లేఖ వచ్చింది. డాక్యుమెంట్లన్నీ సక్రమంగా ఉండడంతో పార్టీకి ఇసి గుర్తింపు ఇచ్చింది.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని శివప్ప అంటున్నారు. వైయస్ పై గౌరవంతో ఆ పార్టీ పేరు అలా పెట్టినట్లు ఆయన తెలిపారు. శివప్ప వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడని తెలుస్తోంది. సుప్రీంకోర్టు సలహా మేరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చింది. వైయస్ జగన్ కోసమే ఆ పార్టీని రిజిష్టర్ చేయించినట్లు కూడా ప్రచారం సాగుతోంది. అధిష్టానం జగన్ పై చర్య తీసుకుంటుందని బలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ గుర్తింపు సాధించడం చర్చనీయాంశంగా మారింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X