హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీమాంధ్ర, తెలంగాణల్లో పోటాపోటీ విద్యాసంస్థల మూసివేత

By Pratap
|
Google Oneindia TeluguNews

Bundh
హైదరాబాద్: ఎపిపిఎస్సీ గ్రూప్ -1 పరీక్ష వివాదం ముదురుతోంది. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో పోటాపోటీ ఆందోళనలు జరుగుతున్నాయి. పోటాపోటీగా శనివారం విద్యాసంస్థలను మూసివేశారు. గ్రూప్ -1లో తెలంగాణ వాటా తేల్చిన తర్వాతనే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలో విద్యాసంస్థల బంద్ జరుగుతోంది. పరీక్ష యధాతథంగా ఈనెల 5వ తేదీననే నిర్వహించాలని సీమాంధ్రలో విద్యాసంస్థల మూసివేత కార్యక్రమం జరుగుతోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి ఆధ్వర్యంలో తెలంగాణలో విద్యాసంస్థలను మూసేశారు. తెలంగాణ అంతటా విద్యాసంస్థలు మూత పడ్డాయి.

ఎపిపిఎస్సీ గ్రూప్ -1 పరీక్షను యధావిధిగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్ర జెఎసి విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చింది. ఈ మేరకు సీమాంధ్రలో విద్యార్థులు విద్యాసంస్థల్లో బంద్ పాటిస్తున్నారు. కాగా, రేపు ఆదివారం పరీక్ష నిర్వహించేందుకు ఎపిపిఎస్సీ పూర్తి ఏర్పాట్లు చేస్తోంది. భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తోంది. పరీక్షను అడ్డుకోవడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ శనివారం నుంచే అమలులోకి వచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X