ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యుద్ధ వాతావరణం

పోలీసులపైకి విద్యార్థులు రాళ్ల వర్షం కురిపించారు. ఈ సమయంలో పోలీసులు లాఠీచార్జీ చేశారు. భాష్పవాయువు ప్రయోగించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసారు. ఉస్మానియాలో విద్యార్థులు భారీ ర్యాలీ తీశారు. అయితే పరీక్ష సజావుగా జరుగుతోందని డిసిపి లడ్హా చెప్పారు. తెలంగాణ జిల్లాల్లో 35 శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. అందులోనూ చాలా మంది పరీక్షను బహిష్కరించారు కూడా. హైదరాబాదులో 45 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. సీమాంధ్రలో 65 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఉస్మానియాకు సమీపంలోని శివం రోడ్డులో ఆందోళనకారులు బస్సుకు నిప్పు పెట్టారు.












Click it and Unblock the Notifications