వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్మాత రామానాయుడికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ramanaidu
న్యూఢిల్లీ: భారత చలన చిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తెలుగు చలన చిత్ర నిర్మాత రామానాయుడును వరించింది. 2009కి గాను ఆ అవార్డును భారత ప్రభుత్వం రామానాయుడికి ప్రకటించింది. ఈ అవార్డు గతంలో తెలుగు చలన చిత్ర రంగానికి చెందిన దేవికారాణి, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి, ఎల్వీ ప్రసాద్, అక్కినేని నాగేశ్వర రావులకు లభించింది. రామానాయుడు 110 చిత్రాలతో అత్యధిక చిత్రాలను నిర్మించిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కారు. ఆయన తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడం, బెంగాలీ వంటి పలు భారతీయ భాషల్లో చిత్రాలను నిర్మించారు. 1936 జూన్ 6వ తేదీన ఆయన జన్మించారు.

రాముడు - భీముడు చిత్రం ద్వారా ఆయన నిర్మాతగా సినీ రంగంలో కాలు పెట్టారు. ఆయన బాపట్ల పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. ఆయన స్థాపించిన సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించే చిత్రంలో నటించడాన్ని నటీనటులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. పలువురు హీరోలను, హీరోయిన్లను వెండి తెరకు పరిచయం చేసిన ఘనత కూడా రామానాయుడికి దక్కుతుంది. ఇప్పటికీ ఆయన నిర్మాణ రంగంలో చురుగ్గా ఉన్నారు. ఆయన కుమారుల్లో సురేష్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, మరో కుమారుడు వెంకటేష్ సినీ హీరోగా స్థిరపడ్డారు. రామానాయుడికి ఈ అవార్డు రావడం పట్ల తెలుగు చలన చిత్ర రంగం హర్షం వ్యక్తం చేస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X