వైయస్ బావమరిది రవీంద్రనాథ్ రెడ్డి అక్రమ ఎరువుల పట్టివేత

మిశ్రమ ఎరువులు తయారీకి ప్రధానంగా యూరియా, డీఏపీ అవసరం. ప్రస్తుతం రాష్ట్రంలో వీటికి తీవ్ర కొరత ఉంది. మంగళవారం పట్టుబడ్డవి యూరియా, డీఏపీలతో తయారు చేసినవే కావడం గమనార్హం. బాలాజీ మిశ్రమ ఎరువుల కర్మాగారంలో తయారైన ఎరువులను నగర శివారులో పట్టుకున్నామని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు చిన్న నారాయణ చెప్పారు. ఎరువుల విలువ రూ.8,21,100 ఉంటుందని, వే బిల్లులు లేకుండా, డెలవరీ చలానాల్లో పేర్కొన్న ఎరువుకు పొంతన లేకుండా ఉన్నట్లు తేలిందని ఆయన అన్నారు. అనంతపురం జిల్లాకు 4, కర్నూలు జిల్లాకు 2 లారీలు తరలిస్తున్నట్లు గుర్తించామని, ఇవి పోలీసుల అధీనంలో ఉన్నాయని, వీటిని వ్యవసాయశాఖకు స్వాధీనం చేయగానే కోర్టుకు అప్పగిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications