ఎమ్మార్ ప్రాపర్టీస్ వివాదంపై చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రోశయ్య

కాగా, సహకార సంఘాల ఎన్నికలను ఆరు నెలలు వాయిదా వేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రస్తుత పాలక మండళ్ల గడువును ఆరు నెలలు పొడగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 124 ఎస్సీ విద్యార్థుల వసతి గృహాలకు ఉచిత విద్యుత్తును, మంచినీటిని అందించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. 2008 డిఎస్సీ నియామకాలపై న్యాయనిపుణుల సలహాలు తీసుకోవాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థి ఉద్యమాలకు బ్రేకులు వేయడానికి దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామకం అధికారాలను గవర్నర్ కు అప్పగిస్తూ మంత్రి వర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై మంత్రివర్గంలో విస్తృత చర్చ జరిగింది.












Click it and Unblock the Notifications