కర్ణాటక బిజెపి సంక్షోభం: రంగంలోకి దిగిన వెంకయ్యనాయుడు

యెడ్యూరప్ప ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు 19 మంది శాసనసభ్యులు గవర్నర్ హెచ్ ఆర్ భరద్వాజకు లేఖ ఇచ్చారు. వీరిలో 14 మంది బిజెపి సభ్యులు. వారి మద్దతు ఉపసంహరణతో బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న శాసనసభ్యుల సంఖ్య 105కు పడిపోతుంది. దాంతో యెడ్యూరప్ప ప్రభుత్వం గట్టెక్కలేదు. అయితే, తాను ఈ నెల 11వ తేదీననే శాసనసభలో బలాన్ని నిరూపించుకుంటానని యెడ్యూరప్ప చెప్పారు. బలనిరూపణ కోసం ఆయనకు గవర్నర్ 12వ తేదీ వరకు గడువు ఇచ్చారు. మరో ఇద్దరు మంత్రులకు కూడా ఉద్వాసన పలికేందుకు యెడ్యూరప్ప సిద్ధపడ్డారు. తిరుగుబాటు శాసనసభ్యులకు యెడ్యూరప్ప మంత్రి పదవులు ఎర చూపుతున్నారు.
ఇదిలా వుంటే, ప్రస్తుత రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తమ శాసనసభ్యులను కాపాడుకునేందుకు కాంగ్రెసు, జెడి(ఎస్) నాయకత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. శాసనసభ్యులతో ఆ రెండు పార్టీలు క్యాంపులు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో మూడు ముక్కలాట సాగుతోంది. తిరుగుబాటు శాసనసభ్యులు ఏ పార్టీకి మద్దతిస్తారనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications