వ్యూహం మార్చుకున్న చంద్రబాబు: పార్టీ నేతలపైనే నిందలు

కాగా, పార్టీ నాయకులపై ఆజమాయిషీని పెంచారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి నాయకులే కారణమని ఆయన నిందించారు. పొలిట్ బ్యూరోలో, రాష్ట్ర కమిటీలో పదవుల కోసం తన చుట్టూ తిరిగిన నేతలు ఆ పదవులు దక్కిన తర్వాత పని చేయడం మానేస్తున్నారని ఆయన తిట్టిపోశారు. అలా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కొత్త నాయకత్వాన్ని ముందుకు తెస్తానని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబులో అకస్మాత్తు మార్పునకు పార్టీ నాయుకులే నివ్వెరపోతున్నారు.
మరో విషయం కూడా పార్టీ నాయకులకు అశ్చర్యం కలిగించింది. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని, తెలంగాణకు మద్దతిస్తామని ఆయన రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఇంత అకస్మాత్తుగా ఆయన ఈ వైఖరిని ప్రకటించడానికి గద్దర్ ప్రజా ఫ్రంటే కారణమని అంటున్నారు. గద్దర్ రాకతో తెలంగాణ ప్రజలు కెసిఆర్ వైపు ఉండాలా, గద్దర్ వైపు ఉండాలా అయోమయంలో పడిపోయారని, ఈ సమయంలో ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి తెలంగాణ అనుకూల ప్రకటన పనికి వస్తుందని ఆయన భావించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications