జగన్ ను అదుపు చేయలేక చంద్రబాబుపై విమర్శలు: సోమిరెడ్డి

ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ నైతికంగా ఓడిపోయిందని ఆయన అన్నారు. ప్రజారాజ్యం, లోక్ సత్తాల వల్ల ఎన్నికల్లో కాంగ్రెసు గట్టెక్కిందని, సొంత బలం వల్ల అది గెలవలేదని ఆయన అన్నారు. ఎన్నికలు వస్తే కాంగ్రెసు చిత్తుగా ఓడిపోతుందని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకం అక్రమాలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంపై న్యాయవిచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని తెలుగుదేశం మరో నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. మంత్రులు మందలాగా వచ్చి చంద్రబాబుపై విమర్శలు చేశారని ఆయన అన్నారు. మంత్రులు పనిచేయడం లేదని, తమ కుటుంబ సభ్యులే అసహ్యించుకునేంత నీచంగా మంత్రులు వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించి ఏడాది కూడా గడవక ముందే మంత్రులు మారిపోయారని, శవంపై పేలాలు ఏరుకునే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications