Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రెచ్చగొట్టే ప్రసంగం చేసిన పవన్ కళ్యాణ్ పై వనపర్తి కోర్టులో కేసు

Pawan Kalyan
మహబూబ్ నగర్: ఎన్నికల సమయంలో రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు యువరాజ్యం అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కేసు దాఖలైంది. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి కోర్టులో స్థానిక కాంగ్రెసు నాయకుడొకరు పవన్ కళ్యాణ్ పై కేసు దాఖలు చేశారు. తాను చేసిన ప్రసంగంపై వివరణ ఇవ్వాలని కోర్టు పవన్ కళ్యాణ్ ను ఆదేశించింది. 2009 ఎన్నికల సందర్భంగా 2008 చివరలో పవన్ కళ్యాణ్ కాంగ్రెసు నాయకులను ధోవతులు ఊడదీసి తరిమికొట్టండని ప్రజలకు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సాక్ష్యం కూడా ఉంది.

ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని కాంగ్రెసు నాయకులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే, వనపర్తికి చెందిన కాంగ్రెసు నాయకుడొకరు మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఇంతకు ముందు కేసు దాఖలు చేశారు. కోర్టు పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ కోర్టు తీర్పును ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు కూడా పవన్ కళ్యాణ్ కు అనుకూలంగానే తీర్పునిచ్చింది. ఆ నాయకుడే మళ్లీ పవన్ కళ్యాణ్ పై అదే విషయంపై కేసు దాఖలు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+