వేధింపులతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య: పాఠశాల ముందు ఆందోళన

Nalgonda
నల్గొండ: పాఠశాలలో రుసుము(ఫీజు) కట్టలేదని యాజమాన్యం వేధించడంతో ఓ విద్యార్థినిని ఆత్మహత్య చేసుకొని మరణించిన సంఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. దేవరకొండ గ్రామానికి చెందిన సమత అదే ఊరిలోని చైతన్న పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. అయితే సమత గత కొన్ని రోజులుగా రుసుము చెల్లించక పోవడంతో యాజమాన్యం ఆమెను కోప్పడింది. అవమానం భరించలేక సమత దగ్గరలోని అక్కంపల్లి రిజర్వనాయరులో దూకి అత్మహత్య చేసుకుంది. ఆధివారం ఉదయం శవాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

శుక్రవారం సాయంత్రం ఇంటివద్దనుండి వెళ్లిపోయినట్టు సమాచారం. అయితే తల్లిదండ్రులు శనివారం సాయంత్రం పోలీసులకు కంప్లయింట్ చేశారు. అయితే ఇది హత్యా, ఆత్మహత్య ఎందువలన జరిగింది అనే విషయాన్ని పోస్టుమార్టమ్ తర్వాతనే చెప్పగలమని పోలీసులు అంటున్నారు.

కాగా తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, స్థానికులు శవంతో పాటు చైతన్య కళాశాల ముందు ఆందోళన చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం వేధింపులే కారణమని వారు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు శవాన్ని తీయమని భీష్మించుకొని కూర్చున్నారు. సమత ఆత్మహత్యకు వారే బాధ్యత వహించాలని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. అయితే పాఠశాల యాజమాన్యం పరారీలో ఉంది. దీంతో అనుమానాలు బలపడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+