కాంగ్రెసుతో కెసిఆర్ మిలాఖత్: చంద్రబాబుపై నిప్పులు

చంద్రబాబు తెలంగాణపై మాట నిలబెట్టుకోకపోవడం వల్ల సీమాంధ్రలో కూడా విశ్వసనీయత కోల్పోతారని, ఆ పార్టీ నిట్టనిలువునా చీలిందని, ఇటు తెలంగాణలోనూ అటు కోస్తాలోనూ ఆ పార్టీ ఎటూ కాకుండా పోతుందని, చంద్రబాబును చూస్తే జాలేస్తుందని ఆయన అన్నారు. చంద్రబాబుకు నైతికత లేదని, మాటిమాటికి మాట మారుస్తారని ప్రజల్లోకి వెళ్లిందని ఆయన అన్నారు. తెలుగుదేశం మద్దతు అవసరం లేకుండానే తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ ముందుకు వెళుతుందని, ఆ పార్టీకి అసెంబ్లీలో మెజారిటీ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీడీపీ అస్తిత్వాన్ని కోల్పోయిందని, అది నిలువునా చీలిపోయిందని చెప్పారు.
తెలంగాణ ఇవ్వబోమని తమ పార్టీ ఎక్కడా చెప్పలేదని కేశవరావు అన్నారు. తెరాసతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు తమ పార్టీ వివిధ రూపాల్లో తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తోందని అంటూ కాంగ్రెసు తెలంగాణకు కట్టుబడుతూ చేసిన ఆ ప్రకటనలను పరిశీలించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications