హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప్పల్ స్టేడియంలో అరకొర సౌకర్యాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Komatireddy Venkat Reddy
హైదరాబాద్: హైదరాబాదులో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు ప్రేక్షకులకు సౌకర్యాలు కల్పించక పోవటం పట్ల సంబధిత అధికారులపై రాష్ర్ట క్రీడా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదాన ప్రాంగణంలో తాగునీరు, తినుబండారాలు అధిక ధరలకు అమ్ముతున్నట్టు వచ్చిన వార్తలపై కూడా ఆయన స్పందించారు. అరకొర వసతులేమిటని వారిని ప్రశ్నించారు.

తాగునీరు, శీతలపానియాలు, బిస్కెట్‌ప్యాకెట్లు వంటి తదితర ఆహారపదార్థాల ధరలను ఇష్టారాజ్యంగా అమ్ముకోకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆయన స్టేడియం నిర్వాహకులను ఆదేశించారు.ఆయన కొద్దిసేపు మైదానంలో జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ ఆటనకు కాసేపు తిలకించారు.హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో తెలంగాణ వారికి ప్రాధాన్యం ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని చెప్పి త్వరలో ఆ చర్యలు చేపడుతానన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X