వైయస్ జగన్ కు సవాల్ విసిరిన మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి

DL Ravindra Reddy
హైదరాబాద్‌: బలప్రదర్శన చేయాల్సింది కృష్ణాతీరంలో కాదని, సత్తా ఉంటే శాసనసభలో చేయాలని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను సవాల్ చేశారు. జగన్ దీక్షలో శాసనసభ్యులు పాల్గొనడం అనైతికమేనని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వారిపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది కాంగ్రెసు అధిష్టానం నాయకులు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చూసుకుంటారని ఆయన అన్నారు. వైయస్ జగన్ కు వ్యవసాయం గురించి తెలియదని ఆయన విమర్శించారు.

అధికారం కోసమే వైయస్ జగన్ ఆరాటమని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ దీక్షలో ఒక్క రైతు కూడా లేడని ఆయన అన్నారు. రైతులకు తాము మెరుగైన ప్యాకేజీ ఇచ్చామని ఆయన చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా ఇంతకన్నా మెరుగైన ప్యాకేజీని ఇచ్చి ఉండేవారు కాదని ఆయన అన్నారు. చంద్రబాబు దీక్ష విరమింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+