విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి చేసిన డాన్సులు ఆగిపోయాయి: జగన్ దీక్షలో జూపూడి ఎద్దేవా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jupudi Prabhakar Rao
విజయవాడ:పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు సిగ్గు ఉంటే రాజీనామా చేసి సోనియాగాంధీ బొమ్మ పెట్టుకొని గెలవాలని శాసనమండలి సభ్యుడు జూపూడి ప్రభాకర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోని వారు అదే రైతులకోసం ఇప్పుడు నిరాహార దీక్ష అనటం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. ప్రజారాజ్యం వ్యవస్థాపక అధ్యక్షుడు నిన్నటి వరకు ప్రభుత్వంలో చేరడానికి డాన్సులు చేశారు. కాని ఇఫ్పుడు ఆయన డాన్సులు ఆగిపోయాయన్నారు.

రాష్ట్ర ప్రజలంతా జగన్ సమర్థిస్తున్నారన్నారు.అంకెల గారడీతో నడిపే ప్రభుత్వాలు కొనసాగవని ఆయన చెప్పారు. రాజశేఖర్ రెడ్డి తన స్వహస్తాలతో తెచ్చిన ప్రభుత్వం ఇది అని, దీనిపై పూర్తి హక్కులు జగన్ కే ఉన్నాయన్నారు. వైయస్ తర్వాత ప్రభుత్వంలో విశ్వసనీయత అనే పదం తొలగి పోయిందన్నారు. జగన్ కు విశ్వసనీయత ఉందన్నారు. అందరూ జగన్ కు మద్దతు పలకాలని కోరారు. రాజశేఖర రెడ్డి రక్తం ఉన్న యువకుడు జగన్ కు అందరూ సపోర్టు చేయాలన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X