హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూరి శవానికి ఉస్మానియాలో పోస్టుమార్టం, హైదరాబాదుకు భానుమతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Gangula Bhanumati
హైదరాబాద్: హత్యకు గురైన గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి మృతదేహానికి మంగళవారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. సూరి మృతదేహాన్ని సోమవారం రాత్రి జూబ్లీహిల్స్‌ లోని అపోలో ఆస్పత్రి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సూరి సోమవారం రాత్రి 7 గంటల 55 నిమిషాలకు మరణించినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. సూరి భార్య గంగుల భానుమతి, కుమారుడు మంగళవారం ఉదయం బెంగళూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. సూరి మృతదేహాన్ని చూసి భానుమతి సొమ్మసిల్లి పడిపోయినట్లు సమాచారం.

కాగా, పోస్టుమార్టం అనంతరం సూరి మృతదేహాన్ని అతని స్వస్థలం అనంతపురం జిల్లాలోని మద్దెలచెర్వుకు తరలిస్తారు. అక్కడే అతని అంత్యక్రియలు జరుగుతాయి. సూరి హత్య నేపథ్యంలో అనంతపురం జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. అనంతపురం జిల్లాలో బంద్ వాతావరణం ఉంది. విద్యాసంస్థలను, వాణిజ్య సంస్థలను మూసేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X