రాజీనామాపై కాంగ్రెసు ఎమ్మెల్యేలకు వైయస్ జగన్ క్యాంప్ సవాల్

YS Jagan
న్యుఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఫోటో పెట్టుకోకుండా గెలిచామని మాట్లాడుతున్న కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులకు జగన్ వర్గం నేతలు సవాల్ విసురుతున్నారు. మంగళవారం న్యూఢిల్లీలో జగన్ చేపట్టిన జల దీక్షలో వారు కాంగ్రెసు ఎమ్మెల్యేలకు రాజీనామాలు చేయాలంటూ సవాల్ చేశారు. ఎమ్మెల్యేలు అమరనాథ్‌ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీకాంత్ ‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులు తదితరులు కాంగ్రెసు ఎమ్మెల్యేల రాజీనామాకు డిమాండ్ చేశారు. రాజీనామాలకు మేం సిద్ధం మీరు సిద్ధమా అని ప్రశ్నించారు.

తాము పార్టీ గుర్తుపైనే గెలిచామని వైయస్ ఫోటోతో గెలవలేదని అంటున్న డిఎల్ రవీంద్రానాథ్‌రెడ్డి రాజీనామా చేయాలని తాను కూడా చేస్తానని అమరనాథ్‌ రెడ్డి అన్నారు. మనమంతా రాజీనామా చేసే ఎన్నికలకు వెళదామని అప్పుడు ప్రజలే తేలుస్తారన్నారు. జగన్ ఆదేశిస్తే తాను వెంటనే రాజీనామాకు సిద్ధమని ఆదినారాయణరెడ్డి ప్రకటించారు. జగన్ రాష్ట్ర రైతుల కోసం చేస్తున్న జల దీక్షను రాజకీయం చేయవద్దని కోరారు. రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించడానికే జగన్ దీక్షలు చేస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+