Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు: వీరప్ప మొయిలీ

Veerappa Moily
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్ప మొయిలీ మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్, పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్‌తో భేటీ అనంతరం వ్యాఖ్యానించారు. జగన్ పార్టీపై, ప్రధాని మన్మోహన్ పై చేసిన వ్యాఖ్యలకు తాను స్పందించనన్నారు.

జగన్ వెంట వెళ్లిన ఎమ్మెల్యేలపై ఏం చర్యలు ఎప్పుడు తీసుకోవాలో మాకు తెలుసునని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి ఢోకా లేదని అన్నారు. 125 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితులు ఎన్నో చూశామని ఆయన చెప్పారు. జగన్ మా పార్టీ సభ్యుడు కాదని అన్నారు. తెలంగాణ ఎంపీలకు గతంలో ఇచ్చిన హామీ మేరకే ఆహ్వానం పంపించామని చెప్పారు.

కాగా అంతకుముందు హైదరాబాదు ఎయిర్ పోర్టులో దిగినప్పుడు ఢిల్లీలో మాజీ పార్లమెంటు సభ్యుడువైయస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన జలదీక్షలో 25 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు ఉన్నారనే విషయం తనకూ తెలుసునని మొయిలీ చెప్పారు. జగన్ వెంట ఉన్న విషయం అధిష్టానానికి తెలుసునని చెప్పారు. వారి విషయం పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్నారు. తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక కేంద్రం పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు. త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+