తెలంగాణలో వైయస్ జగన్కు శాసనసభ్యుల బలమెంత?

కాగా, సుధీర్ రెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి వంటి శాసనసభ్యులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి యువ మంత్రులు వైయస్సార్ అభిమానులే. ఇలా ఇంకా కొంత మంది వైయస్సార్ అభిమానులు ఉన్నారు. అయితే, వారు నేరుగా వైయస్ జగన్కు మద్దతు తెలపడానికి వెనకాడుతున్నారు. మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ తొలుత వైయస్ జగన్కు మద్దతుగా మాట్లాడినా ఆ తర్వాత వెనక్కి తగ్గారు. తెలంగాణ అంశం వైయస్ జగన్కు తెలంగాణలో పెద్ద ఆటంకంగా మారింది. తమ ప్రాంత ప్రజాప్రతినిధులు వైయస్ జగన్ వెంట వెళ్తే తెలంగాణ ప్రజలు సహించే స్థితిలో లేరు. అంతగా తెలంగాణ ఉద్యమం పాతుకుపోయి ఉంది. దీంతో చాలా మంది శాసనసభ్యులు నేరుగా జగన్కు మద్దతు తెలపడానికి ముందుకు రావడం లేదని అంటున్నారు. లోలోపల మాత్రం వైయస్ జగన్ మద్దతుదారులు ఉన్నారని అంటున్నారు. అవసరం వస్తే వారు వైయస్ జగన్కు మద్దతు తెలవచ్చుననే మాట కూడా వినిపిస్తోంది. అయితే, తెలంగాణలో నాయకులకు కాకుండా సంప్రదాయబద్దంగా కాంగ్రెసుకు, ఇందిరా గాంధీ కుటుంబానికి విధేయంగా ఉండే నాయకులే ఎక్కువ. దీంతో వైయస్ జగన్ తెలంగాణలో పాగా వేయడం కష్టమే.
తెలంగాణ ప్రజల మద్దతు సంపాదించడానికి వైయస్ జగన్ కొత్త ఎత్తుగడను అనుసరిస్తున్నారు. తెలంగాణపై ఆయన వర్గం దాగుడు మూతుల ఆడుతోంది. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిందే కేంద్ర ప్రభుత్వమేనని, అందులో వైయస్ జగన్ చేయాల్సింది ఏమీ ఉండదని తాజాగా పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి మంగళవారం ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. జగన్ తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ఇస్తానంటే అడ్డుకునే స్థితిలో కూడా లేరని అంటున్నారు. దీంతో కూడా వైయస్ జగన్కు తెలంగాణ నుంచి మద్దతు లభించే అవకాశం ఉండదు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications