వైయస్ జగన్ అరెస్టుకు యత్నాలు, జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

YS Jagan
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జలదీక్ష చేస్తున్న మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌ను పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జగన్ దీక్షకు సాయంత్రం ఐదు గంటల వరకే పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే, తాను 24 గంటల పాటు దీక్ష సాగిస్తానని జగన్ చెప్పారు.

తనను అరెస్టు చేసినా దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. ఈ స్థితిలో పోలీసులు దీక్ష శిబిరాన్ని చుట్టుముట్టారు. ఖాళీ చేయాలని పోలీసులు అందరినీ ఆదేశించారు. కానీ అందుకు వారు నిరాకరించారు. పోలీసులను అడ్డుకోవడానికి వైయస్ జగన్ వర్గానికి చెందిన కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

తాను బుధవారం ఉదయం 6 గంటల వరకు 30 మందితో దీక్ష చేస్తానని, మిగతావారు వెళ్లిపోతారని వైయస్ జగన్ పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా పోలీసులు వినలేదు. కార్యకర్తలను సముదాయించడానికి ఎమ్మెల్సీ ప్రభాకర రావు ప్రయత్నించారు. తీవ్ర ఉద్విగ్నభరిత వాతావరణంలో జగన్ వర్గం నాయకులు కార్యకర్తలను చల్లబరిచేందుకు ప్రయత్నించారు. మరో గంటలో దీక్షా ప్రదేశాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+