హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవినీతి సొమ్ము తిన్నారు, ఇకనైనా ప్రాజెక్టులు కట్టండి: టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Devender Goud
హైదరాబాద్: ఇప్పటి వరకు అవినీతి సొమ్ము తిన్నారు ప్రజా సంక్షేమం కోసం ఇప్పటికైనా ప్రాజెక్టులు పూర్తి చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరి శుక్రవారం విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయల ప్రజల ఆస్తిని కొల్లగొట్టారన్నారు. ప్రాజెక్టులు ఇప్పుడైనా పూర్తి చేయాలన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి చేతులు దులుపుకుంటే ఊరుకునేది లేదని దేవేందర్ గౌడ్ అన్నారు. పోలవరం కంటే ముందుగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్నారు. ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేసి ఏళ్లు గడుస్తున్నా డిపిఆర్ ఏర్పాటు చేయకపోవడం సిగ్గు చేటు అన్నారు. తక్షణమే ప్రాజెక్టులు చేపట్టాలన్నారు.

ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించడం కోసం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఆందోళనకు సిద్ధమవుతుందని మరో నేత కడియం శ్రీహరి అన్నారు. వెంటనే ప్రాణహితను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. పార్టీలో చర్చించిన తర్వాత కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకు రావచ్చో నిర్ణయించుకుంటామన్నారు. కాంగ్రెస్‌కు ప్రాజెక్టులు నిర్మించడంపైన చిత్తశుద్ధి లేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X