వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం రచ్చబండకు పోలీసులు ఓవర్ యాక్షన్: పాల్గొనే వారికి పాసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nalgonda
నల్గొండ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రచ్చరచ్చ అవుతుండటంతో నల్గొండ జిల్లాలో పోలీసులు వింత పోకడకు వెళ్లారు. నల్గొండ జిల్లాలోని దేవరకొండ మండలం కొండమల్లేపల్లి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం ఉంది. గురువారం మహబూబ్‌ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమంలో తెలంగాణవాదులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో ఇక్కడి పోలీసులకు వింత ఆలోచన వచ్చింది.

మహబూబ్‌నగర్ జిల్లా వంటి సంఘటన ముఖ్యమంత్రి రచ్చబండలో జరగకూడదని భావించిన పోలీసులు రచ్చబండలో పాల్గొనే ప్రజలకు పాసులు ఇచ్చారు. పాసులు ఉన్నవారు మాత్రమే రచ్చబండలో పాల్గొనాలి. పాసులు లేని వారు రచ్చబండలో పాల్గొనే అవకాశం లేదు. అంతేకాకుండా పాసులతో పాటు కార్యక్రమంలో పాల్గొనాలంటే గుర్తింపు కార్డు కూడా వెంట తెచ్చుకోవాలనే రూలు పెట్టారు. పోలీసులు పెట్టిన రూలును చూసి సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X