వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈజిప్టు సంక్షోభం: 300 మంది భారతీయులు విమానంలో వెనక్కి

By Pratap
|
Google Oneindia TeluguNews

Egypt
న్యూఢిల్లీ: ఈజిప్టులో నెలకొన్న సంక్షోభం తగ్గు ముఖం పట్టే అవకాశాలు కనిపించడం లేదు. ముబారక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల మీదికి వచ్చి ఆందోళనలు సాగిస్తున్నారు. దీంతో భారత ప్రభుత్వం తన పౌరులను వెనక్కి తెచ్చేందుకు ఏర్పాట్లు మొదలు పెట్టింది. దాదాపు 300 మంది భారతీయులు, ఎక్కువగా పిల్లలు, మహిళలు సోమవారం ప్రత్యేక విమానంలో భారత్ చేరుకుంటున్నారు.

ఈజిప్టు నుంచి భారతీయులను వెనక్కి పంపడానికి ఈజిప్టు రాజధాని కైరోలని భారత దౌత్యాధికారులు సహాయం చేస్తున్నారు. అధ్యక్షుడు హోస్నీ ముబారక్ తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద యెత్తున ఆందోళనలు సాగుతున్నాయి. ముబారక్ గత మూడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్నారు. ఘర్షణల్లో వంద మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. వేయి మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X