రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ కోసం స్వీయ నిర్బంధంతో లాయర్ల ఆమరణదీక్ష

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
రంగారెడ్డి: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం రంగారెడ్డి జిల్లా కోర్టు హాలులో ముగ్గురు లాయర్లు స్వీయ నిర్బంధం చేసుకొని ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. జూనియర్ అడ్వోకేట్ల సంఘం కార్యదర్శి భార్గవ, మరో ఇద్దరు లాయర్లు కోర్టు హాలులోనికి వెళ్లి లోపల తాళం వేసుకున్నారు. సోమవారం ఉదయం కోర్టు హాలులోకి వెళ్లి లోపలకు తాళం వేసుకున్న లాయర్లు పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడతామని స్పష్టమైన హామీ వస్తేనే తాము గది తలుపులు తీస్తామని హెచ్చరించారు. హామీ వచ్చే అమరణ నిరాహార దీక్ష చేపడతామన్నారు.

కాగా తెలంగాణ ఉద్యమంలో ఈ లాయర్లు మొదటినుండి ఉద్యమిస్తున్నారు. తమకు శ్రీకృష్ణ కమిటీ రిపోర్టుతో సంబంధం లేదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు పెట్టాలనే ఏకైక డిమాండ్‌ను వారు ప్రభుత్వం ముందుంచారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇప్పటికే ఏడాది పాటు ఆలస్యం చేసిందని వారు ఆరోపించారు. కమిటీ ఇచ్చిన ఆరు పరిష్కారాల్లో ఏ ఒక్కదానిలో కూడా స్పష్టత లేదన్నారు. తెలంగాణ కోసం ప్రజలంతా ఉద్యమించాలని వారు అన్నారు. వారికి మద్దతుగా కోర్టుకు భారీగా తెలంగాణవాదులు తరలారు. రచ్చబండను తెలంగాణనుండి మరల్చడానికే అన్నారు. గవర్నర్, ముఖ్యమంత్రి తెలంగాణపై హామీ ఇవ్వాలని భార్గవ డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X