హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూరి హత్య కేసులో మరిన్ని ఆధారాలు దొరికాయి: ఎకె ఖాన్

By Pratap
|
Google Oneindia TeluguNews

AK Khan
హైదరాబాద్: మద్దెల చెరువు సూరి హత్య కేసులో మరికొన్ని ఆధారాలు దొరికాయని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఏకే ఖాన్ గురువారం మీడియాకు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న భాను కిరణ్ తలదాచుకుంటున్న ప్రాంతాల సమాచారం కూడా దొరికిందన్నారు. ఇప్పటి వరకు పోలీసు టీమ్‌లు చాలా ప్రాంతాలకు వెళ్లాయని, అతని ఆచూకీ మాత్రం లభించలేదని తెలిపారు. ప్రస్తుతం అతడు కొన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు సమాచారం ఉందన్నారు. ఈ సమాచారం మేరకు ఆయా ప్రాంతాలకు టీమ్‌లను పంపామని తెలిపారు.

ఇద్దరు ఏసీపీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు బృందాలు భాను వేటలో ఉన్నాయని ఏకే ఖాన్ చెప్పారు. సూరి హత్యతో పాటు భానుపై మరో మూడు కేసులు నమోదైనట్టు చెప్పారు. హత్య మినహా మిగతా మూడు కేసుల దర్యాప్తు చివరి దశలో ఉందని చెప్పారు ఈ మూడు కేసుల్లో ఇప్పటి వరకు చాలా ఆధారాలు సేకరించామని, ఇంకొన్ని సేకరించాల్సి ఉందని తెలిపారు. భాను చేతిలో మోసపోయిన వారు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X