హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ట దిగజారుతోంది: మన్మోహన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
జమ్ము: అవినీతి, అక్రమాల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ట దిగజారుతుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం జమ్మూలోని సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పేరుకు పోయిన అవినీతి వల్ల అభివృద్ధికి కూడా తీవ్ర ఆటంకం కలుగుతుందన్నారు. అయితే యూపిఏ ప్రభుత్వం అవినీతిని సమర్థవంతంగా ఎదుర్కొంటుందని చెప్పారు. అవినీతివల్లే దేశ ప్రతిష్ట మసకబారుతుందన్నారు. ద్రవ్యోల్భణం పెరుగుదల కూడా ఆందోళన కలిగిస్తుందన్నారు. పథకాల అమలు తీరులో నాణ్యత లోపించిందన్నారు. అవినీతిపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

కాగా ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ రాష్ట్ర పర్యటన ఖరారయింది. మన్మోహన్‌సింగ్ శనివారం ఉదయం 7.45 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్నారు. ఆయన సోమాజిగూడలోని గవర్నర్ రాజభవన్‌లో బస చేస్తారు. అనంతరం 6వ తేది ఉదయం మన్మోహన్‌సింగ్ హైదరాబాద్‌లోని హైటెక్సులో జరగనున్న కామన్వెల్తు న్యాయ సదస్సును ప్రారంభిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X