వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్షలున్న జగన్ కోట్లు ఎలా కూడబెట్టాడు: టిడిపి అధినేత చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
ప్రకాశం: చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని ముందుగా ఊహించన విషయమేనని అందులో కొత్త విషయం ఏముందని తెలుగుదేశం పార్టీ సీనియర్ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సోమవారం ప్రకాశం జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. పీఆర్పీ, కాంగ్రెస్ విలీనం ముందుగా అందరూ ఊహించినదే అని చెప్పారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నయం కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్కటేనన్నారు. జాతీయస్థాయిలో విపక్షాలను ఏకత్రాటిపైకి టిడిపి తెచ్చినదని చెప్పారు. పేదరిక నిర్మూల కోసమే ఎన్టీఆర్ టిడిపిని స్థాపించాడని అన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నియంతలా వ్యవహరించారని అన్నారు. వైఎస్ తన హయాంలో సెజ్‌ల పేరుతో వేలాది ఎకరాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టారని అన్నారు. గిరిజన చట్టాలను తుంగలో తొక్కి లక్షల ఎకరాలు కావాల్సిన వారికి కట్టబెట్టారని ఆరోపించారు. వాన్‌పిక్ నుండి జగన్ సాక్షికి 750 కోట్ల రూపాయలు ఎలా వెళ్లాయని ఆయన ప్రశ్నించారు. కేవలం 8 లక్షల రూపాయల పెట్టుబడితో 1250 కోట్ల రూపాయల డబ్బును జగన్ ఎలా సృష్టించగలిగారని అన్నారు. రాష్ట్రంలో చాలామంది మధుకొడాలు, రాజాలు ఉన్నారన్నారు. వైఎస్ అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్ వేలకోట్లు సంపాదించారని ఆరోపించారు.

కృష్ణ జలాలను తీసుకు రావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అప్పుల పాలైన రైతులను ఆదుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదన్నారు. రైతుల కోసం మంగళవారం జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు. చేనేత కార్మికులకు న్యాయం జరిగే వరకు టిడిపి పోరాటం చేస్తుందన్నారు. ప్రపంచ ఆధునీకరణలో మన ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్‌పుట్ సబ్సిడీపై మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X