పంచెలు ఊడదీస్తానన్న వారిని పంచెన చేర్చుకున్నారు: రోజా
ముంపు బాధితులకు పరిహారం విషయంలో మాట్లాడని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధికోసం ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. చిరంజీవికి జాతీయ హోదా ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. పంచెలూడదీస్తామన్న వారిని పంచన చేర్చుకున్నారన్నారు. వైయస్ వారసులమంటూనే జగన్పైన విమర్శలు చేస్తున్నారన్నారు. పోలవరం లక్షల ఎకరాలు సాగుకు ఉపయోగపడుతుందన్నారు. పోలవరం వల్ల తెలంగాణకు ప్రయోజనం లేదనే మాటల్లో వాస్తవం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం హయాంలో రైళ్ల విషయంలో, నీళ్ల విషయంలోనే కాకుండా మర్యాద విషయంలోనూ చిన్న చూపు చూస్తుందన్నారు. పోలవరం వైయస్ కల అని దానికి జాతీయ హోదా కల్పించి త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
కాగా అంతకుముందు మాజీ మంత్రి పిల్లి సుభాష్చంద్రబోసు మాట్లాడుతూ సర్ ఆర్ధర్ కాటన్ బ్రిడ్జిపై ఎన్ని ప్రాజెక్టులు నిర్మించినా తమకు అభ్యంతరం లేదన్నారు. దిగువ ప్రాంత రైతులకు పోలవరం రెండోదశ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ప్రభుత్వం నీటిని వినియోగించుకోలేక పోయిందన్నారు. పోలవరం ప్రధాన ప్రాజెక్టుకు వెంటనే టెండర్లు పిలవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరానికి వెంటనే జాతీయ హోదా కల్పించాలన్నారు. పూర్తిస్థాయిలో గోదావరి నీటిని మనం సద్వినియోగం చేసుకోలేక పోయామని అన్నారు.