వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారి పని వారు చేశారు: మావోయిస్టులపై కలెక్టర్ వినీల్ కృష్ణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vineel Krishna
భువనేశ్వర్: మావోయిస్టులు తనను కిడ్నాప్ చేయడాన్ని మల్కన్‌గిరి కలెక్టర్ వినీల్ కృష్ణా తప్పు పట్టక పోవడం విశేషం. ప్రజలకు చేయూత అందించటం కోసం వారి కార్యక్రమాలు వారు చేపడుతున్నారని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మావోయిస్టుల చెరలో తొమ్మిది రోజులు ఉండినప్పటికీ ఆయనలో ఎలాంటి భయాందోళనలు కనిపించక పోవడం విశేషం. తొమ్మదిరోజుల క్రితం తనను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు తనను కొండ ప్రాంతాలలో తిప్పారన్నారు. తనను బాగానే చూసుకున్నారని అన్నారు. ప్రజా సంక్షేమాలపై, అభివృద్ధిపై తనతో చర్చించారని చెప్పారు.

కాగా తాను విడుదల అయిన తర్వాత తన గురించి ఇటు ఒరిస్సా రాష్ట్రంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారన్న విషయం తెలుసుకొని చాలా ఉద్వేగానికి లోనయ్యానని చెప్పారు. తన విడుదలకు మద్దతు ప్రకటించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన విడుదల కోసం గిరిజనులు ఇంత అభిమానం చూపించడం వారికి మరింత సేవ చేయాలనే కోరిక కలిగిందన్నారు. ఇప్పటి వరకు వారికి నేను చేసింది చాలా తక్కువ అని ఇకనుండి మరింత సేవ చేస్తానని చెప్పారు. అందరూ నాపై ప్రేమాభిమానాలు చూపించారన్నారు.

English summary
Malkangiri Collector Vineel Krishna not condemned Maoists kidnap. He said they are doing their activities for people. He said thanks to all the Orissa and Andhra people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X