పార్టీల అభిప్రాయాల తర్వాత తెలంగాణపై నిర్ణయం: కిరణ్ కుమార్ రెడ్డి
ముఖ్యమంత్రి వివరణతో బిజెపి, సిపిఐ సభ్యులు సంతృప్తి చెందలేదు. చర్చకు పట్టుబట్టారు. తెలుగుదేశం సభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు కాంగ్రెసుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చిచ్చు పెట్టింది కాంగ్రెసు పార్టీయేనని, పరిష్కరించాల్సింది కూడా ఆ పార్టీయేనని ఆయన అన్నారు. సోనియా గాంధీ గానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ తెలంగాణపై తమ తమ వైఖరులను ఎందుకు చెప్పడం లేదని ఆయన అడిగారు. తెలుగుదేశం సభ్యుల తీరుపై ప్రభుత్వ చీఫ్ విప్ మల్లుభట్టి విక్రమార్క విరుచుకుపడ్డారు. చంద్రబాబు సభలో కూర్చోలేని పరిస్థితిని తెలుగుదేశం సభ్యులు కల్పిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సభలో సరిగా వ్యవహరించాలని నాదెండ్ల మనోహర్ చెప్పినా సిపిఐ, బిజెపి సభ్యులు వినలేదు. దీంతో సభను ఆయన వాయిదా వేశారు.
Comments
కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ గాలి ముద్దుకృష్ణమనాయుడు తెలంగాణ హైదరాబాద్ kiran kumar reddy assembly telangana hyderabad gali muddukrishnama naidu
English summary
Chief Minister N Kiran Kumar Reddy said that Centre will take decision on Srikrishna Committee report after consulting 8 political parties belong to Andhra Pradesh. He said that all political parties should express opinion on Srikrishna committe report.
Story first published: Friday, March 4, 2011, 11:16 [IST]