హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవరి ఓట్లైనా అడుగుతాం, బాబుతో శతృత్వం లేదు: సిఎం కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: శాసనమండలి ఎన్నికల్లో గెలవడానికి ఎవరి ఓట్లనైనా అడుగుతామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడమే తమ లక్ష్యమని చెప్పారు. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలం లేదని అన్నారు. అందుకే ఆ పార్టీ పోటీ చేయడం లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో తనకు ఎలాంటి శతృత్వం లేదన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు ఏవీ లేవన్నారు. 2014 వరకు కాంగ్రెసు ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. ఆ తర్వాత కూడా కాంగ్రెసు ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఈ వంద రోజుల్లో ఎన్నో స్పీడ్ బ్రేకర్లు వచ్చాయన్నారు.

ఉద్యమాల వల్ల తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారని కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సహాయ నిరాకరణ వల్ల పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి, సంఘాలు పరీక్షలకు సహకరించాలని కోరారు. ఆరు నెలల్లో అన్ని సమస్యలు సమసి పోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ జెఏసి తలపెట్టిన మిలియన్ మార్చ్ సందర్భంగా మార్చ్ 10న జరగనున్న ఇంటర్ పరీక్షపై శనివారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నాజీతంపై లోక్‌సభలో భారతీయ జనతా పార్టీ మాట్లాడటం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.

English summary
CM Kiran Kumar Reddy said they will urge all the leaders to win in MLC election. He suggest employees to withdraw Non Co-Operation movement. He said Telangana people is loss with non co-operation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X