హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పేరు మారినా నేను మారను: పీర్పీ సమావేశంలో చిరంజీవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: పేరు మారవచ్చు కానీ తాను మాత్రం ఎన్నటికీ మారనని ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో అన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు‌లో విలీనం చేయడానికి పార్టీ ప్రతినిధుల ఆమోదం సమావేశాన్ని చిరంజీవి హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. పీఆర్పీని కాంగ్రెసు‌లో విలీనం చేయడాన్ని దాదాపుగా అందరూ సమర్థించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి చిరంజీవి మాట్లాడారు. ఈ సమావేశం ఫేర్‌వెల్ పార్టీ అని అనుకోకూడదని ఆయన పార్టీ నేతలకు సూచించారు. కొత్త పార్టీలో ఇదే భావనలతో పని చేస్తామని చెప్పారు.

ప్రజారాజ్యం పార్టీకి కాంగ్రెసు పార్టీ అవసరం ఎంతగా ఉందో, కాంగ్రెసు‌కు పీఆర్పీ అవసరం అంతే ఉందన్నారు. పీఆర్పీని నిర్మాణాత్మక దిశలో నడిపానని చెప్పారు. అందరూ తనకు బాగా సహకరించారన్నారు. పీఆర్పీని చిరంజీవి పార్టీ అన్న విధంగా ఉందన్నారు. అయితే తాను ప్రవచించిన సమాజిక న్యాయం కోసం కాంగ్రెసు పార్టీలో విలీనం అయిన తర్వాత కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. నేను, నా భావాలు, విధానాలు, ఆలోచనలు ఇందులో మార్పు రాలదేన్నారు. కేవలం పేరు మాత్రమే మారిందన్నారు. హోదాకోసం నేను విలీనం చేయడం లేదన్నారు. ప్రజలకు సామాజిక న్యాయం జరగాలంటే మరికొంత బలం అవసరమనే ఉద్దేశ్యంతోనే విలీనం ప్రక్రియను ప్రారంభించామన్నారు.

English summary
PRP president Chiranjeevi said today that they are changing only party, but chiru will not changed. He gave message in PRP last meeting, held at Hyderabad. He said it is not farewell party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X