హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీలో చంద్రబాబుకు ఎదురు తిరిగిన జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ వర్గం శానససభ్యులు అనుకున్నట్లుగానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వ్యూహానికి ప్రతివ్యూహాన్ని అనుసరిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన భూకేటాయింపులపై సభా సంఘం వేయాలని శాసనసభా కార్యక్రమాలను స్తంభింపజేస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ సభ్యులకు జగన్ వర్గం శాసనసభ్యులు శనివారం కౌంటర్ ఇచ్చారు. భూ కేటాయింపులపై సభా సంఘం వేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం సభ్యులు శనివారం ఉదయం సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు.

తెలుగుదేశం సభ్యులకు దీటుగా జగన్ వర్గం ఎమ్మెల్యేలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. జగన్ వర్గానికి చెందిన 11 మంది శాసనసభ్యులు చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. తెలుగుదేశం సభ్యులకు అనూహ్యమైన ఎదురు దాడి ఎదురైంది. దాంతో డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను అర గంట పాటు వాయిదా వేశారు.

భూ కేటాయింపులపై సభా సంఘం వేయాల్సిందేనని తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు డిమాండ్ చేశారు. జగన్ వర్గం శాసనసభ్యులపై తెలుగుదేశం శాసనసభ్యులు మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేసి ప్రజల ముందుకు రావాలని వారు డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలోని వ్యవహారాలపై ఎన్నో కమిటీలు వేశారని, అవినీతిని నిరుపించారా అని వారన్నారు. చంద్రబాబు హయాం నుంచి జరిగిన భూకేటాయింపులపై సభా సంఘం వేయాలని వారు డిమాండ్ చేశారు.

English summary
It is happened to TDP president N Chandrababu Naidu to face counter of YS Jagan camp MLAs in assembly today. Exhibiting placards against Chandrababu, Jagan camp MLAs stalled the proceedings of assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X