ఏనుగుల దాడిలో ఇద్దరి మృతి: చిత్తూరులో తమిళనాడు సరిహద్దులో సంఘటన
Districts
oi-Srinivas G
By Srinivas
చిత్తూరు: జిల్లాలో ఆదివారం ఏనుగుల దాడిలో ఇద్దరు దుర్మరణం చెందిన దుర్ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఉన్న వేపలపల్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మామిడితోటలోకి వచ్చిన ఏనుగులను అదిలించడానికి వచ్చిన ఇద్దరిపై ఏనుగులు దాడి చేశాయి. వారిని తొక్కి చంపేశాయి.
ఏనుగులు సృష్టించిన భీభత్సంలో మృత్యువాత పడ్డ వారు కెన్ చెప్పన్, దాసన్గా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది.