హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కౌన్సెలింగ్‌కు చిరంజీవి కూతురు శ్రీజ, అల్లుడు శిరీష్ భరద్వాజ్ డుమ్మా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Srija-Sirish Bharadwaj
హైదరాబాద్: ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి కుమార్తె శ్రీజ, అల్లుడు శిరీష్ భరద్వాజ్ గురువారం కౌన్సెలింగ్‌కు హాజరు కాలేదు. దీంతో వారిద్దరు కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సిందిగా లీగల్ సర్విసెస్ అధారిటీ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 16వ తేదిన కౌన్సెలింగ్‌కు రావాలని అథారిటీ చెప్పింది. కాగా ఇటీవలే శ్రీజ తన భర్త, అత్తమామలు తనను వేధిస్తున్నారని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లింది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను తన తల్లిదండ్రులతో కలిసి వేధిస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముందస్తు బెయిల్‌ను కోరుతూ శిరీష్ భరద్వాజ్ స్థానిక కోర్టుకు వెళ్లారు. తన భార్యతో మాట్లాడడానికి ఒకసారి అవకాశం కల్పించాలని అతను కోర్టును కోరాడు. దీనిపై స్పందించిన కోర్టు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచనలు చేసింది.

English summary
PRP president Chiranjeevi's daughter Srija and Sirish Bharadwaj were not went to counselling today. So, Legal services authority ordered them to attend on April 16.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X