హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ రాష్ట్రానికి పట్టిన శని, ఓ శాడిస్టు: వి హనుమంతరావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumanth Rao
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన శని అని కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి హనుమంతరావు శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ఓ శాడిస్టు అని అన్నారు. కడప ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీదే విజయం అని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ దగ్గర డబ్బులు తీసుకొని కాంగ్రెసుకు ఓటు వేయాలని విహెచ్ కడప ఓటర్లకు సూచించారు. రాష్ట్రాన్ని అవినీతితో దోచుకున్న అక్రమార్కుడు జగన్ వద్ద వోటర్లు డబ్బులు తీసుకుంటే తప్పులేదని ఆయన అన్నారు. బిజెపి కన్నా జగన్ చాలా డేంజర్ వ్యక్తి అని అన్నారు. జగన్ ఎప్పుడు, ఎక్కడ వదిలేస్తారో ఎవరికీ తెలియదన్నారు. బిజెపి సీనియర్ నాయకుడు అన్నీ మాట్లాడుతారు కానీ జగన్ అవినీతిపై ఎందుకు మాట్లాడరని దుయ్యబట్టారు. బిజెపి జగన్ అక్రమాలపై ఎందుకు మాట్లాడదని ప్రశ్నించారు.

కడప బరిలో జగన్ గెలిస్తే ముస్లింలకు నష్టం అని అన్నారు. బిజెపితో లోపాయకారి ఒప్పందం కారణంగా బిజెపి తమ అభ్యర్థిని బరిలోకి దింపలేదని అన్నారు. బలం లేకనే పోటీ చేయడం లేదనే అనటం సిగ్గు చేటు అన్నారు. కనిమొలి, సురేష్ కల్మాడిపై చర్యలు తీసుకున్నట్టుగానే జగన్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. వైయస్ బతికి ఉంటే జగన్ వ్యవహార శైలిపై తీవ్ర మనస్థాపం చెందే వారన్నారు.

English summary
Congress senior leader V Hanumantha Rao lashes out Ex MP YS Jaganmohan Reddy today. He suggested voters that take money from Jagan and vote to Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X