తెలంగాణపై పురందేశ్వరి అమాయకంగా మాట్లాడుతున్నారు: కోదండరామ్

వచ్చే పార్లమెంటు సమావేశాలలో తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మినహా మరే నిర్ణయం తీసుకున్నా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో తెలంగాణ తీర్మానం ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రెండో ఎస్సార్సీ అవసరం లేదన్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం లేదన్నారు.












Click it and Unblock the Notifications