నాకు వ్యక్తిగత అభిప్రాయాలు లేవు: పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ

పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యం అన్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు అందరు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం కలిగిస్తూ పని చేస్తానని అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. పార్టీలో అందరినీ కలుపుకొని పోతానని చెప్పారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు తనపై చేసిన వ్యాఖ్యలపై బొత్స మాట్లాడారు. విహెచ్ను కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకుంటానని చెప్పారు.












Click it and Unblock the Notifications