వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఆస్తులపై సిబిఐ ఏం తేల్చింది, రేపే నివేదిక?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై ప్రాథమిక దర్యాప్తు చేసిన సిబిఐ రేపు మంగళవారం తన నివేదికను హైకోర్టుకు సమర్పించనుంది. రేపు నివేదికను కోర్టుకు సమర్పిస్తామని సిబిఐ డిఐజి లక్ష్మినారాయణ చెప్పారు. వైయస్ జగన్ కంపెనీల్లోకి నిధులు మళ్లినట్లు సిబిఐ గుర్తించిందని అంటున్నారు. రెండు వారాల పాటు రాత్రింబవళ్లు కష్టపడి సిబిఐ అధికారులు నివేదికను రూపొందించారు. తాము 28 కంపెనీలను విచారించినట్లు లక్ష్మీనారాయణ చెప్పారు. కంపెనీల ఐటి రిటర్న్స్, బ్యాంక్ బ్యాలెన్స్‌లను, ఆడిట్ నివేదికలను అడిగినట్లు ఆయన తెలిపారు.

బెంగుళూర్, కోల్‌కత్తాలకు చెందిన కంపెనీలను కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందువల్లనే ప్రభుత్వానికి తక్కువ వాటా దక్కిందని సిబిఐ అధికారులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్ ప్రతినిధులు మరోసారి సోమవారం సిబిఐ అధికారులకు తమ వాదనలు వినిపించారు. బెంగుళూర్‌కు చెందిన మంత్రి, క్లాసిక్ వంటి సంస్థల ప్రతినిధులు సిబిఐ ముందు హాజరయ్యారు.

English summary
CBI to submit its report on YSR Congress party president YS Jagan properties to High Court tommorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X