తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరోసారి పేలుళ్లకు కుట్ర: రాష్ట్రాలకు ఐబి హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Srisailam Dam
న్యూఢిల్లీ: ముంబయి దాడుల తర్వాత తీవ్రవాదులు మరోసారి దేశంలో చెలరేగే ప్రమాదాలు పొంచి ఉన్నాయని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కొన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు పంపినట్లుగా తెలుస్తోంది. మన రాష్ట్రంతో పాటు గుజరాత్, హర్యానా, తమిళనాడు, ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్రలకు తీవ్రవాదుల నుండి ముప్పు పొంచి ఉందని ఐబి హెచ్చరికలు జారీ చేసింది. మన రాష్ట్రంలో ప్రపంచ వ్యాప్త ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతితో పాటు శ్రీశైలం, హైదరాబాదు, శ్రీశైలం డ్యామ్, వైజాగ్‌లపై తీవ్రవాదులు కన్నేసినట్లుగా తెలుస్తోంది.

అలాగే విదేశీ పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలోనూ తీవ్రవాదులు రెచ్చిపోయే అవకాశం ఉందని ఐబి ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తిరుపతి, శ్రీశైలం, హైదరాబాదు తదితర ప్రాంతాలలో భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే తీవ్రవాదులు ఈ మధ్య శ్రీశైలం డ్యామ్ పైన కన్నేయడంతో అక్కడ సైతం గట్టి నిఘా ఏర్పాటు చేయనున్నారు. దేశంలోని దేవాలయాలు, పర్యాటక కేంద్రాలే తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు ఐబి హెచ్చరించింది.

English summary
IB warned six states that terrorists planning to blast like Tiurapti, Srisailam and Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X