జగన్‌పై వేధింపులకు ప్రజల మనోవేదన: శోభా నాగిరెడ్డి

Shobha Nagi Reddy
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న జాతీయ కాంగ్రెసు పార్టీకి రాష్ట్రంలో ప్రజలు త్వరలో బుద్ది చెప్పే రోజు వస్తుందని జగన్ వర్గం నేత శోభానాగిరెడ్డి గురువారం అన్నారు. జగన్‌పై కాంగ్రెసు పార్టీ అధిష్టానం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. జగన్ ఆస్తులపై సిబిఐ సోదాల కారణంగా రాష్ట్ర ప్రజలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని అన్నారు.

తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనలేకనే కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. కాగా సాక్షి పత్రిక, ఛానల్, భారతి సిమెంట్స్, సండూరు పవర్ ప్రాజెక్టు తదితర జగన్ కంపెనీల కార్యాలయాల పైన, జగన్ ఇంట్లో, బ్రదర్ అనీల్ కుమార్ ఇంట్లో సిబిఐ సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ విషయం తెలిసిన శోభా నాగిరెడ్డి గురువారం ఉదయం జగన్ ఇంటికి వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+