జగన్ అంతానికి వైయస్ జగనే బాధ్యుడు: డిఎల్

జగన్ అక్రమాలు వైయస్ రాజశేఖర రెడ్డికి తెలియవని, వైయస్సార్ అధికారాన్ని జగన్ అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. కాంగ్రెసు వల్లనే జగన్ ప్రయోజనం పొందారని ఆయన అన్నారు. తాను నిర్దోషినని చెప్పుకోవడానికి తన సంస్థల్లోకి పెట్టుబడులు ఎలా వచ్చాయో జగన్ ఎందుకు వివరించడం లేదని ఆయన అడిగారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ పార్టీ విషయాలు మాత్రమే వైయస్ రాజశేఖర రెడ్డితో మాట్లాడారని ఆయన స్పష్టం చేశారు.
రాజీనామాలు చేస్తామని వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు చెప్తారని, కానీ రాజీనామాలు చేయరని ఆయన అన్నారు. రాజీనామాలు చేసి మళ్లీ పోటీ చేసి జగన్ వర్గం ఎమ్మెల్యేలు గెలవాలని ఆయన అన్నారు. జగన్కు మద్దతు పలుకుతున్న పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యవహారం కూడా త్వరలో బయటకు వస్తుందని ఆయన అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ విషయంలో తాను రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు పేరు ఎప్పుడూ చెప్పలేదని, అదృశ్య శక్తులున్నాయని మాత్రమే అన్నానని, సిబిఐ దర్యాప్తులో అన్నీ బయటకు వస్తాయని ఆయన అన్నారు.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
జగన్కు విజయమ్మ షాక్: నీ చెల్లికి, మేనల్లుడికి అన్యాయం చేశావు -
పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications