కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఒక్కడికే సాధ్యం: జగన్ వర్గం ఎమ్మెల్యేలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pilli Subhash Chandra Bose
కడప: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కేవలం కడప పార్లమంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యం అని ఆయన వర్గం శాసనసభ్యులు మంగళవారం అన్నారు. ఇడుపులపాయలోని వైయస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఎమ్మెల్యేలు వైయస్ ఆశయం కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కుట్రలను ప్రజల్లోకి తీసుకు వెళతామని ప్రతిజ్ఞ చేశారు. వైయస్ పథకాలు కొనసాగించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజా కోర్టుకు వెళ్లి జగన్ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తామని చెప్పారు. ఎన్నికలు వస్తే టిడిపి, కాంగ్రెసు అడ్రస్ గల్లంతే అని చెప్పారు.

ప్రజల హృదయాల నుండి వైయస్‌ను తుడిచి వేసేందుకు కాంగ్రెసు కుట్రలు చేస్తోందని ఎమ్మెల్యే బాబూరావు అన్నారు. వైయస్సార్‌ను అవినీతిపరుడిగా చిత్రీకరించడాన్ని ప్రజలు తట్టుకోలేక పోతున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైయస్ పెట్టిన భిక్ష అని అన్నారు. కాగా ఈ నెల 30వ తారీఖున రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో జగన్ భేటీ కానున్నారు.

English summary
YSRC party president YS Jaganmohan Reddy mlas said today that late YSR schemes will continue if Jagan come in to rule.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X